Thursday, March 15, 2007

ఆవు - పెద్దపులి





ఒక అడవిలో ఒక పులి వుండేది.
అది ఆకలితో తిరుగుచుండగా దానికొక ఆవు కనపడింది. అలాకనపడగానే దానిని తినటానికి పులి ఆవు మీద పడింది. అప్పుడు ఆ ఆవు మనసులో భయపడినది గాని, ఎలాగూ పులి చంపితింటుంది అని నిశ్చయించుకుని
"అయ్యా నేను ఈ మధ్యనే ఈనాను. నా దూడ పాలకి యేడుస్తూ వుంటుంది. నేను వెళ్ళి పాలు ఇచ్చిఇప్పుడే వస్తాను. ఆ దైవ సాక్షిగా నా మాట నమ్ము" అని పులిని అడిగింది.
ఆ మాటలు పులి రాజు నమ్మి "పోయి రా" అని చెప్పగానే ఆ ఆవు పరుగెత్తుకుని పోయి తన దూడకి కడుపునిండాపాలు ఇచ్చి, తోడి పశువులకు దూడని అప్పగించి పులి వద్దకు వచ్చింది.
అప్పుడు మన పులి రాజు, ఆవు తన మీద వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయనందుకు సంతోషించి,దాన్ని చంపక దయతో విడిచి పెట్టింది. ఆవు పులి దయా గుణాన్ని మెచ్చుకుని ఇంటికి పోయి తన దూడతోహాయిగా వుంది.
~
ఈ కధలో నీతి యేమిటి పిల్లలూ?
~
సత్యము వలన ఎల్లప్పుడూ మేలు కలుగుతుంది. ఎప్పుడూ అబద్దాలు ఆడకూడదు.
^
^

2 comments:

Sravan Kumar DVN said...

nice blog, pillalakosam kathalu blog cheyyatam bagundi.
-Sravan

హృదయ బృందావని said...

thank you Sravan garu :)